బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి ససునాక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజుతో సమావేశమైన రిషి సునాక్.. అనంతరం ప్రధానిగా తొలిప్రసంగం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం మూలాన దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్ను బయటపడేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం, సమగ్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానిగా రాజీనామా చేసిన లిజ్ ట్రస్ను అభినందించారు రిషి. ఆమె దేశ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే చిన్న తప్పులు చేసినా, అవి ఉద్దేశపూర్వకంగా చేయలేదని భావిస్తున్నాని చెప్పారు.